రెడ్లైట్ ఏరియా కామాటిపుర ప్రెసిడెంట్గా అలియా భట్!
on Feb 24, 2021
అలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తోన్న 'గంగుబాయ్ కథియవాడి' సినిమా టీజర్ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. నేడు భన్సాలీ బర్త్డే. ఈ సందర్భంగా బ్రిలియంట్, సూపర్బ్ అనిపించే తన సినిమా టీజర్ను ఆడియెన్స్కు స్పెషల్ గిఫ్ట్గా ఆయన అందించారు.
భారీ సెట్టింగ్స్తో, కళ్లు చెదిరే విజువల్స్తో కలర్ఫుల్గా సినిమాలను ప్రెజెంట్ చేస్తారనే పేరున్న సంజయ్ లీలా భన్సాలీ, మరోసారి 'గంగుబాయ్ కథియవాడి' టీజర్తో తన ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన పలు బ్లాక్బస్టర్ మూవీస్ కోవలోనే ఈ మూవీ రూపొందుతోందనే విషయాన్ని టీజర్ తెలియజేస్తోంది. సందర్భవశాత్తూ ఇది భన్సాలీకి పదవ చిత్రం. అందుకే తన కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోయేలా ఈ మూవీని ఆయన తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పటికే టాలెంటెడ్ యాక్ట్రెస్గా నిరూపించుకున్న అలియా భట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే తరహా క్యారెక్టర్తో మన ముందుకు రానున్నట్లు ఈ ఒక నిమిషం 30 సెకన్ల టీజర్తో అర్థమైపోతోంది. టీజర్ బిగినింగ్లో ఆమె ఇంట్రడ్యూస్ అయిన విధానమే షాకింగ్గా ఉంది. ఈ మూవీలో ఆమె ముంబై రెడ్లైట్ ఏరియా కామాటిపురకు ప్రెసిడెంట్గా కనిపించనున్నట్లు టీజర్ తెలియజేస్తోంది. నటిగా అలియా భట్ కెరీర్లో గంగుబాయ్ కేరక్టర్ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఊహించవచ్చు.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ అమేజింగ్ అనిపిస్తున్నాయి. టీజర్ రిలీజైన మరుక్షణం నుంచే 'గంగుబాయ్ కథియవాడి' సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
హుస్సేన్ జైది రచించిన "మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై" బుక్ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ, డాక్టర్ జయంతీలాల్ గడా (పెన్ స్టూడియోస్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది.
Also Read